భద్రాద్రి కొత్తగూడెం : గోదావరి నదికి మళ్లీ వరద పోటెత్తింది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతున్నది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 43.50 అడుగులుగా ఉంది. గోదావరిలో ప్రస్తుతం 9.55 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొసాగుతోంది. ఈ నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
గత నెలలో భద్రాచలం వద్ద గోదావరికి రికార్డు స్థాయిలో వరద పోటెత్తిన విషయం తెలిసిందే. 70 అడుగుల మేర ప్రవహించింది గోదావరి. 48 అడుగులకు వరద చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది. 53 అడుగుల దాటితే అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసి, రెడ్ అలెర్ట్ ప్రకటించనున్నారు.