కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి వరద క్రమంగా తగ్గుతూ వస్తున్నది. గోదారి నీటిమట్టం ప్రస్తుతం 47.9 అడుగులకు చేరగా, 11,39,230 క్యూసెక్కులుగా ప్రవాహం ఉన్నది. వరద ఉధృతి నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. గోదావరికి వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం రికార్డు స్థాయికి చేరిన విషయం తెలిసిందే. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎగువన ఉన్న ప్రాజెక్టుల గేట్లు మూసివేశారు. దీంతో భద్రాచలం వద్ద గోదావరిలో వరద క్రమంగా తగ్గుతూ వస్తున్నది.