హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( GHMC) కమిషనర్ గా నూతనంగా నియమితులైన రోనాల్డ్ రోస్( Ronald Rose )బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, ఇప్పటి వరకు ఆర్థిక శాఖలో కార్యదర్శిగా రోనాల్డ్రోస్ విధుల్ని నిర్వర్తించారు. జీహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేసిన లోకేశ్కుమార్ను అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా ప్రభుత్వం నియమించిన విషయం విదితమే. రోనాల్డ్ రోస్కు గతంలో ఖైరతాబాద్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్గా, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్గా పనిచేసిన అనుభవం ఉన్నది.