కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 3: కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలు, కార్మికులు, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్న ఆలోచనతో రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎంపీ సంతోష్కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమంలో, అలాగే కరీంనగర్ 36వ డివిజన్ కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్లు స్థానిక బస్టాండ్ చౌరస్తాలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.