ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుఫాన్ తీరానికి చేరువ కావడంతో ముంబై తీరంలో వాతావరణం భయానకంగా మారింది. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో తీరం వెంబడి రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దాదాపు 20 అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడుతూ పరిస్థితిని భీతావహంగా మార్చేశాయి. ముంబై తీరంలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో అలల ఉర్రడిని ఈ కింది వీడియోలో చూడవచ్చు.