మోర్తాడ్, అక్టోబర్ 17 : అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం వడ్యాట్ గ్రామానికి చెందిన గంగపుత్ర సంఘం సభ్యులు మద్దతు ప్రకటించారు. 24 కుటుంబాలకు చెందిన వారు మంగళవారం సమావేశమై ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
మంత్రి వేముల చొరవతోనే తమ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని వారు పేర్కొన్నారు. అనంతరం తీర్మాన పత్రాన్ని బీఆర్ఎస్ నాయకులకు అందజేశారు.