నల్లగొండ : గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు పోలీస్ శాఖ ద్వారా తీసుకోవాల్సిన అనుమతులను ఆన్ లైన్ ద్వారానే ఇవ్వనున్నట్లు డీఐజీ ఏవీ రంగనాధ్ తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న http://policeportal.tspolice.gov.in ద్వారా అనుమతులు ఇస్తారని తెలిపారు.
మండపాల నిర్వాహకులు వెబ్ సైట్ ద్వారా వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని అధికారులు వాటిని పరిశీలించి గణేష్ మండపాల ఏర్పాటుతో పాటు నిమజ్జన అనుమతులు ఆన్ లైన్ ద్వారా ఇస్తారని ఆయన తెలిపారు. గణేష్ నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు.
మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ సూచనలు పాటిస్తూ కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు. గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటి వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్లు సంబందిత పోలీస్ స్టేషన్లలో సమర్పించాలని ఆయన తెలిపారు.
గణేష్ మండపాల వద్ద, నిమజ్జన శోభాయాత్రలో డి.జె.లకు అనుమతి లేదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిని సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. గణేష్ నవరాత్రులను నిర్వహించే సమయంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి..
డీసీపీ కార్యాలయ సిబ్బంది ఔదార్యం..వృద్ధురాలికి చేయూత
Ind vs Eng | ఇంగ్లండ్ గెలుస్తుందా? చేజింగ్లో ఆ టీమ్ రికార్డేంటి? ఓవల్ పిచ్ ఎలా ఉంది?
కందకుర్తి వద్ద ఉధృతంగా గోదావరి ప్రవాహం