యాదాద్రి భువనగి : అహింసాయుత మార్గాన్ని ఆయుధంగా మలచుకుకొని.. ప్రపంచానికి సరికొత్త సిద్ధాంతాన్ని అందించిన యోధుడు గాంధీజీ అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం చౌటుప్పల్లో సామూహిక జాతీయగీతాలాపనలో పాల్గొని మాట్లాడారు.
అహింస అనే ఆయుధంతో దేశానికి స్వాతంత్య్రం సాధించిన గొప్ప వ్యక్తి గాంధీజీ అన్నారు.
అలాంటి మహనీయుల గొప్పతనాన్ని నేటి తరానికి తెలియ జెప్పాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం అన్నారు. అందులో భాగంగానే వజ్రోత్సవ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.
గాంధీజీని అగౌరపరిచేలా కొన్ని దుష్ట శక్తులు బయలు దేరాయన్నారు. వాటన్నింటికి చరమ గీతం పాడి వర్తమాననికి స్వాతంత్య్ర సంగ్రామం, దాని విశిష్టతను నేటి తరాలకు అందించాలనే బృహత్తర ఆలోచన తోటే వజ్రోత్సవాలకు సీఎం కేసీఆర్ అంకురార్పణ చేశారన్నారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, శాసనమండలి సభ్యుడు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యే కిశోర్ కుమార్,శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్, బొల్లం మల్లయ్య యాదవ్, మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జ్ కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.