T Congress | హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ద్రోహులకు గాంధీ భవన్ అడ్డాగా మారుతున్నది. కాంగ్రెస్ వేదికగా తెలంగాణ వ్యతిరేకులు ఏకమవుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎంలు రాజశేఖర్రెడ్డి, చంద్రబాబు వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు అంశ అయిన రేవంత్ గాంధీ భవన్లో తిష్ట వేయగా.. తాజాగా మరో నేత ఈ జాబితాలో చేరుబోతున్నారనే ప్రచారం జరుగుతున్నది. రాజశేఖర్రెడ్డి వారసత్వాన్ని కొనసాగించేందుకు ఆయన కూతు రు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆమె తన వైఎస్సార్సీపీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారని, ఇందుకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద కీలక చర్చలు కూడా జరిగినట్టు తెలిసింది. ఆమె ఏపీని కాదని.. తెలంగాణలో రాజకీయం చేసేందుకే ప్రాధా న్యం ఇస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే మరో తెలంగాణ వ్యతిరేక వారసత్వం గాంధీ భవన్లో అడుగుపెట్టే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు వారసుడిగా కాంగ్రెస్లో చేరిన రేవంత్.. తెలంగాణపై చంద్రబాబు ప్లాన్ ను అమలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఇందుకు అనుగుణంగానే రేవంత్ కూడా ఓటుకు నోటు కేసుతో తెలంగాణలో రాజకీయ అస్థిరతను నెలకొల్పే కుట్ర చేశారు. దీంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల నిర్మాణాన్ని కేసుల పేరుతో అడ్డుకొంటూ తెలంగాణ ప్రజలకు సంక్షేమానికి అడుగడుగునా అడ్డుపడుతున్నారు. ఇప్పుడు ఆయనకు షర్మిల తోడైతే తెలంగాణ రాష్ర్టాన్ని ఏ విధంగానూ అభివృద్ధి కాకుండా ప్రజల సంక్షేమాన్ని వదిలేసి రాజకీయమే పరమావధిగా కుట్రలు చేస్తారనే ఆందోళన నెలకొన్నది. ఇక నాడైనా, నేడైనా సొంత ప్రాంతానికి అన్యా యం జరుగుతుంటే తెలంగాణ కాంగ్రెస్ నేత లు కిక్కురుమనడం లేదు. వారిది ఎప్పుడూ ప్రేక్షక పాత్రే. నాడు రాజేశేఖర్రెడ్డి, కిరణ్కుమార్రెడ్డి తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుంటే పదవుల కోసం వారిని ఎదిరించే సాహసం చేయలేకపోయారనే ఆరోపణలు ఎలాగూ ఉన్నాయి. కనీ సం నాడు ఎదురించే ధైర్యం చేయకపోయినా.. నేడైనా తెలంగాణ వ్యతిరేకులను అడ్డుకోవచ్చు కదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.