హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) డైరెక్టర్గా గంప గోపాల్ను ప్రభుత్వం నియమించింది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) కంచన్బాగ్ యూనిట్ అధిపతిగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేసి రిటైరైన గోపాల్.. మూడేండ్లపాటు ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ పదవిలో కొనసాగుతారు. ఇందుకు సం బంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో గోపాల్ ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మె ల్యే గంప గోవర్ధన్తో కలిసి మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తనను డైరెక్టర్గా నియమించడంపై గోపాల్ హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.