పెద్దపల్లి : సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ సింగరేణి కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని టీబీజీకేఎస్ అనుబంధ అసంఘటిత రంగ కార్మిక సంఘం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నాయకుడు రాజేశం తెలిపారు.
గురువారం పెద్దపెల్లి ప్రెస్క్లబ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. వెంటనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గుగనుల ప్రైవేటీకరణను నిలిపివేయాలన్నారు.
ప్రభుత్వం నిరంకుశ విధానాలను వీడనాడకుంటే ఆందోళనలో ఉధృతం చేస్తామన్నారు. మోదీ ప్రభుత్వం మెడలు వంచైనా ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆకుల స్వామి, వివేక్ పటేల్, రాజేందర్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Jai Bhim: తగ్గని జై భీమ్ హవా.. టాప్లో నిలిచిన సూర్య లేటెస్ట్ చిత్రం
Brutally murdered | పెద్దపల్లి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య
Singareni | బొగ్గు గనుల అమ్మకాలపై భగ్గుమన్న సింగరేణి కార్మికులు