హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జనవరి 1న చిన్నారులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. తల్లిదండ్రులతో కలిసి ప్రయాణించే 12 ఏండ్లలోపు పిల్లలకు ఒక్కరోజు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్టు ఎండీ తెలిపారు. ఈ సదుపాయం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సుల్లో వర్తిస్తుందని, ఈ మేరకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని సజ్జనార్ గురువారం ఆదేశాలు జారీచేశారు.