నల్లగొడ: రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో సర్కారు కొలువులను భర్తీ చేస్తున్నది. ఇప్పటికే వీటికి సంబంధించిన నియామక ప్రక్రియ ప్రారంభించింది. పోలీస్, గ్రూప్-1 పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వీటికోసం ఉద్యోగార్థులు ప్రిపరేషన్ ప్రారంభించారు. అయితే ఎక్కడ ప్రారంభించాలి, ఎలా మొదలు పెట్టాలి, ఏయే అంశాలపై దృష్టిపెట్టాలనే సందేహాలు అభ్యర్థుల మెదడును తొలుస్తూ ఉంటాయి.
ఇలాంటి అవరోధాలను ఎదుర్కొని అభ్యర్థులు తమ సన్నద్ధతను విజయవంతంగా సాగించేలా మార్గనిర్ధేశనం చేయడానికి నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఉచిత అవగాహన సదస్సును నల్లగొండలోని లక్ష్మీ గార్డెన్స్లో జరుగుతున్నది. ఈ సదస్సులో సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు, వేప అకాడమీ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ వేప, నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి వివిధ అంశాలపై ఉద్యోగార్థులకు అవగాహన కల్పిస్తారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆత్మీయ అతిథులుగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని కింది లింక్ద్వారా యూట్యూబ్లో లైవ్ద్వారా కూడా వీక్షించవచ్చు.