Dense Fog | హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ)/నిడమనూరు/శంషాబాద్ రూరల్: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉదయం కురిసిన దట్టమైన పొగమంచు ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మరణాలకు కారణమైంది. ప్రయాణాలకు అంతరాయం కల్పించింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు 30 విమానాల దారి మళ్లింపునకు దారితీసింది. రాష్ట్రంలో చలి తీవ్రత కూడా గణనీయంగా పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్లో కనిష్ఠంగా 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ ఎల్ల్లో అలర్ట్ జారీచేసింది.
దట్టమైన పొగమంచు కారణంగా రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం అర్ధరాత్రి బైక్ ఢీ కొన్న ఘటనలో ఇద్దరు చనిపోగా, అందులో ఒకరి మృతదేహాన్ని చూసేందుకు ఆటోలో వెళ్తుండగా, లారీ ఢీ కొట్టడంతో మరో నలుగురు దుర్మరణం చెందారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం మల్లెవానికుంటతండాలో విషాదం నెలకొన్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లెవానికుంటతండాకు చెందిన రమావత్ శివ (19) డీజే ఆపరేటర్. అతడు ఆదివారం అర్ధరాత్రి మిర్యాలగూడ నుంచి బైక్పై ఇంటికి బయల్దేరాడు. నిడమనూరు మండలం వేంపాడు స్టేజీ వద్ద దుకాణం నిర్వహిస్తున్న గ్రామస్థుడు బల్గూరి సైదులు (60) మూత్ర విసర్జన చేసి రోడ్డు దాటుతుండగా.. బైక్పై వేగంగా వస్తున్న శివ పొగమంచులో కనబడక ఢీకొట్టాడు. దాంతో సైదులు అక్కడికక్కడే మృతిచెందారు. శివ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న పోలీసులు 108 వాహనంలో మిర్యాలగూడ దవాఖానకు తరలిస్తుండగా శివ మార్గమధ్యంలో చనిపోయాడు.
శివ మరణ వార్త తెలుసుకున్న అతడి కుటుంబసభ్యులు సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో టాటా ఏస్ వాహనంలో మిర్యాలగూడ దవాఖానకు బయల్దేరారు. వేంపాడు శివారులోని సాయిబాబా విగ్రహం వద్దకు రాగానే.. దట్టమైన పొగమంచులోనూ అతివేగంగా వస్తున్న లారీ.. టాటా ఏస్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న మృతుడు శివ పెద్దనాన్న రమావత్ గన్యా (40), మేనత్త మూడావత్ బుజ్జి (38), బావ దూపావత్ నాగరాజు (28), పూల్యాతండాకు చెందిన ఆటో డ్రైవర్ రమావత్ పాండు (28) అక్కడికక్కడే మరణించారు. శివ తండ్రి రమావత్ ప్రభాకర్, బంధువులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను, మృతదేహాలను పోలీసులు మిర్యాలగూడ ఏరియా దవాఖానకు తరలించారు.
దట్టమైన పొగమంచు కారణంగా సోమవారం ఉదయం శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎయిర్పోర్టుకు రావాల్సిన 30 విమానాలను అధికారు లు దారి మళ్లించారు. పొగమంచు దట్టంగా కురవడంతో 300 మీటర్ల దూరంలో ఏమనున్నదో కనిపించని పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో మ స్కట్, జెడ్డా, రియాద్ నుంచి శంషాబాద్ రావాల్సిన అంతర్జాతీయ విమానాలను బెంగళూరుకు మళ్లించినట్టు ఎయిర్పోర్టు అధికారులు తెలిపా రు. బెంగళూరు, తిరువనంతపురం, గోవా నుంచి రావాల్సిన ఎయిర్ ఇండియా, విస్తారా, స్పైస్ జెట్, స్టార్ అలయెన్స్ విమానాలను ఏపీలోని గన్నవరం ఎయిర్పోర్టుకుకు మళ్లించినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్లో ఆది, సోమవారం ఉద యం 8.30 గంటల వరకు పొగమంచు భారీగా కురియడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బెంగళూరు-హైదరాబాద్ విమానం తిరిగి బెంగళూరుకు, ముంబై-హైదరాబాద్ విమానం తిరిగి ముంబైకి పంపించారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
1. రమావత్ శివకేశవులు
2. రమావత్ ఘన్యా
3. దూపావత్ నాగరాజు
4.రమావత్ పాండునాయక్
5. మూడావత్ బుజ్జి
రాష్ట్రంలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత పెరిగింది. ఉద యం 10 గంటలైనా మంచు దుప్పటి తొలగడం లేదు.ఇక పాఠశాలలు, కళాశాలలకు వి ద్యార్థులు, ఆఫీసులు, ఇతర పనులకు ప్రజ లు పొగమంచులోనే వణుకుతూ వెళ్తున్నా రు. 2 రోజుల క్రితంతో పోలిస్తే ఆదివారం రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. పలు జి ల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్లో అత్యల్పంగా 7.4 డిగ్రీలు, ఆసిఫాబాద్లో 8, గి న్నెధరిలో 8, బేలలో 9.1, బజార్హత్నూర్లో 9.3, నిర్మల్లో 9.5, డిగ్రీల కనిష్ఠ ఉ ష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
హైదరాబాద్ జం ట నగరాల్లో అత్యల్పంగా 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల మ ధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు మూడు రోజులపాటు ఎల్లో అలర్ట్ జారీచేశారు. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉన్నదని పేర్కొన్నారు. చలికి తోడుగా భారీగా పొగ మంచు కురుస్తుండటంతో రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్లో వృద్ధులు గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరించారు.