Road Accident | హన్మకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును టిప్పర్ ఢీకొట్టింది. కటక్షాపూర్ – ఆత్మకూరు మధ్య ఈ ఘటన చోటు చేసుకున్నది. ప్రమాదంలో చిన్నారి సహా నలుగురు తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది.
మేడారం వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులను నరసింహస్వామి (50), సాంబరాజు (42), ఆకాంక్ష (26), లక్ష్మీప్రసన్న (6)గా గుర్తించారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎనిమిది ఉన్నారు. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. క్షతగాత్రులను ఎంజీఎంకు తరలించగా.. చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.