Siricilla | రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నలుగురు రైతులు కరెంట్ షాక్కు గురయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. బావుసాయిపేట గ్రామానికి చెందిన ఉష్కల రోశయ్య అనే రైతు పొలంలో బోరు మోటారు దించేందుకు నలుగురు రైతులు వచ్చారు. బోరు మోటారు దించుతుండగా.. నలుగురు రైతులకు కరెంట్ షాక్ తగిలింది. అపస్మారకస్థితిలోకి వెళ్లిన ఈ నలుగురిని 108 అంబులెన్స్లో వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నలుగురిలో ఒకరు మృతి చెందారు. కర్నాల శ్రీనివాస్, కర్నాల మహిపాల్, పంబల రాజు అనే ముగ్గురు రైతుల పరిస్థితి విషమంగా ఉంది. మృతుడిని పంబల భూమయ్య(33)గా పోలీసులు గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైతులను జడ్పీ చైర్ పర్సన్ అరుణ పరామర్శించారు.