నాగర్కర్నూల్: జిల్లాలోని చారకొండ మండలం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తుర్కల పల్లి సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న దిమ్మెను ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో నలుగులు అక్కడిక్కడే మృతిచెందారు. మరొకరు గాపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
గాయపడిన వ్యక్తిని దవాఖానకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వీరంతా నేరేడుచర్లకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.