చేర్యాల, ఫిబ్రవరి 14: సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లిలో గురువారం రైల్వేస్టేషన్(హాల్ట్) నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు భూమిపూజ చేయనున్నారు. మనోహరాబాద్-కొత్తపల్లి నూతన రైలుమార్గంలో నిర్మించిన రైల్వేలైన్ సమీపంలో కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్(హాల్ట్) నిర్మించనున్నారు.
కొమురవెల్లి స్వాగత తోరణం సమీపంలో కొమురవెల్లి ఆలయానికి వచ్చే రహదారి పక్కన రైల్వేస్టేషన్ నిర్మాణానికి సంబంధిత శాఖ అధికారులు ఇటీవల స్థలాన్ని ఎంపిక చేయడంతోపాటు భూమిపూజకు అన్ని ఏర్పాట్లు చేశారు.