హైదరాబాద్ : సంఖ్యా బలం ఉందని అసెంబ్లీ(Assembly)లో ప్రతిపక్షాల నోరు నొక్కేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ(Congress) శతవిధాల ప్రయత్నిస్తున్నది. అందుకు బీఆర్ఎస్ నాయకులు బలమైన కౌంటర్ అంటాక్తో అధికార పార్టీకి ధీటైన సమాధానమిస్తున్నారు. కాగా, అధికారం ఎవరికి శాశ్వతం కాదు.
చేసిన పనులే చిరకాలం చరిత్రలో నిలిచిపోతాయని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చలో భాగంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే మీకు గుర్తు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు. హామీలన్నీ నెరవేరిస్తే మీకే మంచి పేరు వస్తుందని ఆయన పేర్కొన్నారు.