నాగర్ కర్నూల్ : ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అన్ని వేళల్లో అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి( Marri Janardhan reddy ) తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ నాగర్ కర్నూల్(Nagarkarnool) ప్రజలకు అన్నివేళల్లో అండగా ఉంటానని, ఎవరు కూడా అధైర్య పడవద్దని సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్(BRS) జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తన ట్రస్ట్ ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలకు అన్ని కొనసాగుతాయని స్పష్టం చేశారు. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అన్ని రకాలుగా అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకనీ శ్రీనివాస్ యాదవ్, పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.