మహబూబ్నగర్ : బీఆర్ఎస్ కార్యకర్తలు(BRS Activists) ఓడిపోయామని దిగులుపడొద్దని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి(Ala Venkateshwar Reddy )అన్నారు. సోమవారం అన్నసాగర్ గ్రామంలో భూత్పుర్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడారు. పోరాటం మనకు కొత్త ఏమి కాదని, ఎలాంటి సమస్యలు ఉన్నా పార్టీ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. బతికున్నంత కాలం దేవరకద్ర నియోజకవర్గ ప్రజల మధ్యనే ఉంటానని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రేపటి భవిష్యత్ కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వంద శాతా గెలిచేలా పని చేయాలన్నారు. ఈ పదేళ్ల కాలంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అభివృద్ధి మీ కండ్ల ముందు ఉంది. ఏ కష్టం వచ్చినా మీకు 24 గంటలు అందుబాటులో ఉంటానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో కాటం ప్రదీప్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.