జగిత్యాల : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) సోమవారం జగిత్యాల (Jagtial ) లో జరుగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి , బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) , ఎమ్మెల్సీ రమణ ( MLC Ramana ) ఆదివారం పరిశీలించారు.

పట్టణంలోని స్వామి వివేకానంద స్టేడియంలో బహిరంగ సభ నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లు, జన సమీకరణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీమంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ లో చేరనున్న నేపథ్యంలో వారి నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు.