హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాలు అని, దానిని చేరపడం నీ తరం కాదని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఈ మేరకు నిరంజన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ ఆనవాలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ రూపంలో ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్ లోనే మీ (సీఎం) వెనకాలనే ఠీవిగా ఉన్నదని చురకలంటించారు. తెలంగాణలో ఎకడికి వెళ్లినా, ఢిల్లీ వెళ్లినా కేసీఆర్ అనే లెజెండ్ ఆనవాళ్లు మీ కంటే ముందే ఉంటాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చెరిపి వేయాలనుకున్న భగత్సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేదర్, పీవీ మొదలగు వారి ఆనవాళ్లు ఇన్నేళ్లయినా చేరిపేయలేక పోయారని గుర్తుచేశారు.