హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)కు తెలంగాణలో ప్రతి ఇంచు మీద సమగ్రమైన అవగాహన ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) అన్నారు. మంగళవారం చలో నల్లగొండ(Chalo Nallagonda) బహిరంగ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. నీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి మళ్లించాలో ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించాలో కేసీఆర్కు బాగా తెలుసన్నారు. కృష్ణానదీ జలాల్లో న్యాయమైన వాటా కోసం గొంతెత్తి నినదించిన ఏకైక తెలంగాణ నాయకుడు కేసీఆరేనని స్పష్టం చేశారు.
కాగా, నల్లగొండ పట్టణ శివారులో నార్కట్పల్లి-అద్దంకి హైవేకు అనుకుని మర్రిగూడ బైపాస్లో విశాలమైన స్థలంలో బీఆర్ఎస్ సభ నిర్వహిస్తున్నది. నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు, రైతులు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో 300 మంది కూర్చునేలా విశాలమైన వేదికను నిర్మించారు. వేదికకు ఎదురుగా వీఐపీ, మీడియా గ్యాలరీలను నిర్మించారు. వాటి వెనుక ప్రజలు కూర్చునేలా ప్రత్యేకంగా పలు గ్యాలరీలను ఏర్పాటుచేశారు.