హైదరాబాద్ : పనిపైనే దృష్టి పెట్టి పాలన సాగించిన ఘనత కేసీఆర్(KCR) దక్కుతందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో చిన్న ఘర్షణ లేకుండా కేసీఆర్ పాలన సాగిందని గుర్తు చేశారు. అత్యంత స్నేహ పూర్వక వాతావరణంలో ప్రజలు మెలిగేలా సుపరిపాలన అందించారని చెప్పారు. ఎంతో మంది ఎన్నో ఆరోపణలు చేసినా, ఇష్టారీతిగా మాట్లాడినా ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదన్నారు.
కానీ, సీఎం రేవంత్ రెడ్డి(Revanth reddy) రోజు కేసీఆర్ను విమర్శించడాన్నే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ను తిడితేనే పెద్దవాళ్లం అవుతామనకుంటే ప్రయోజనం ఉండదన్నారు. చేసే పని ద్వారా కేసీఆర్ను మరిపించేలా పాలన ఉండాలని హితవు పలికారు. ఇప్పటికైనా దూషణలు మాని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని నిరంజన్రెడ్డి సూచించారు.