హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నీటి హకులు తేలే వరకు ఉద్యమాన్ని వదిలిపెట్టబోమని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో కేఆర్ఎంబీ సమావేశం విషయంలో కాంగ్రెస్ ప్రభు త్వ ఉదాసీనత మూలంగా ప్రాజెక్టుల నిర్వహణ కేంద్రం పరిధిలోకి వెళ్లిపోయిందని తెలిపారు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని రాష్ట్రం లో ప్రధాన ప్రతిపక్షానికి చెప్పలేదని విమర్శించారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిన నేపథ్యంలో ఉమ్మడి 5 జిల్లాల ముఖ్య నేతలతో కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు.
అనంతరం మాజీ మంత్రులు జీ జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎంపీ లింగయ్యయాదవ్తో కలిసి మీడియా సమావేశంలో నిరంజన్రెడ్డి మాట్లాడారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సరారు తెలంగాణ ప్రయోజనాలను వెండి పల్లెంలో కేంద్రానికి అప్పగించిందంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టులా మారిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 13న నల్లగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఇరు రాష్ర్టాలకు కృష్ణా నదీ జలాలు జీవన్మరణ సమస్య అని పేర్కొన్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం ద్వా రా రాష్ర్టానికి తీరని అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన లేకుండా.. అప్రమత్తంగా ఉండకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్లాయని తెలిపారు. ఇది రాష్ర్టానికి గొడ్డలిపెట్టులాంటిదని తెలిపా రు.
ఈ నిర్ణయంపై కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. గత నెల 17న జరిగిన కేంద్ర జల్శక్తిశాఖ ఆధ్వర్యం లో జరిగిన సమావేశంలో కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణ కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సర్కారు అంగీకరించిందని, ఈ విషయాన్ని గడపగడపకూ తీసుకెళ్తామని తెలిపారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై అనేక షరతులు విధించామని తెలిపారు. అందువల్లే నిర్ణయం వాయిదా పడుతూ వచ్చిందని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాజెక్టులపై సరైన అవగాహన, వ్యూహం లేకపోవడంవల్ల తొందరపాటుతో కేఆర్ఎంబీకి అప్పగించాలని నిర్ణయించిందని తెలిపారు.
కేవలం రెండు నెలలోపే కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచితంగా ఆలోచించి తెలంగాణ శాశ్వత ప్రయోజనాలకు దెబ్బకొట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రానికి ప్రాజెక్టుల నిర్వహణ హకులు ఇవ్వడం అంటే ఆంధ్రా ప్రయోజనాలు నెరవేర్చడమేనని స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల దాదాపు పూర్తయ్యిందని, కేవలం కాలువలు మాత్రమే మిగిలిపోయాయని అన్నారు. దానికి సాగునీళ్లు ఎలా తెస్తారని ప్రశ్నించారు. తెలంగాణ నీటివాటా తేలే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. నీటి హకులు కాపాడాలని కోరితే కేసీఆర్ను విమర్శించడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. నల్లగొండ సభకు ఆంక్షలు విధిస్తే కోర్టును ఆశ్రయిస్తామని, ఆంక్షలతో సభను అడ్డుకోలేరని అన్నారు. మంత్రి ఉత్తమ్ రాజకీయ గురువు వైఎస్సార్నే ఎదురొన్నామని చెప్పారు.