హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని నిలువునా వంచిస్తున్నదని, రైతు భరోసా కింద రైతాంగానికి ఈ ప్రభుత్వం ఏకంగా రూ.29,300 కోట్లు బాకీ పడిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ఎన్నికల ముందు ఎకరానికి రూ.15వేల చొప్పున రైతుభరోసా ఇస్తామని చెప్పిన రేవంత్రెడ్డి, తీరా అధికారంలోకి వచ్చాక రూ.12వేలే ఇస్తున్నారని, అది కూడా మూడుసార్లు ఎగ్గొట్టారని ఒక ప్రకటనలో మండిపడ్డారు. రైతులకు బాకీ పడిన రూ.29,300 కోట్లు ఎన్ని రోజుల్లోగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారో రేవంత్రెడ్డి తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల పొట్టకొట్టే విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం వీడకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.