హైదరాబాద్ : సన్ ఫ్లవర్ రైతులను( Sunflower farmers) ఆదుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు( Harish Rao) ట్విట్టర్ వేదికగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును(Tummala Nageswara Rao) కోరారు. ఈ ఏడాది సన్ ఫ్లవర్కు మద్దతు ధర క్వింటాల్కు రూ.6,760 ఉండగా రైతులు రూ.5 వేల లోపే అమ్ముకుంటున్నారు.
రైతులు మద్దతు ధర లేక క్వింటాల్కు రూ.2వేలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగులో చేసిని విషయాన్ని గుర్తు చేశారు. గతంలో మాదిరిగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు.
గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారికి..
రాష్ట్రవ్యాప్తంగా సన్ఫ్లవర్ పండించిన రైతులు మద్దతు ధర రాకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సంవత్సరం మద్దతు ధర రూ. 6760 ఉండగా మార్కెట్లో మాత్రం రూ. 4 వేల నుంచి రూ. 5 వేలకే రైతులు అమ్ముకుంటున్నారు. ప్రతి…
— Harish Rao Thanneeru (@BRSHarish) February 22, 2024