భూములు కోల్పోతున్న రైతుల పక్షాన పోరాడితే ప్రతిపక్ష నేతలను అడ్డుకుంటారా? అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. ఎలాంటి తప్పు చేయకుంటే సర్కార్కు భయమెందుకని నిలదీశారు. మాజీ మంత్రి హరీశ్రావు గృహ నిర్బంధం అక్రమమని, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అరెస్టు అప్రజాస్వామికమని విమర్శించారు.
అధికారం చేతిలో ఉన్నదని ఈ ప్రభుత్వం అక్రమంగా రైతుల భూములు చెరబడుతున్నదని మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో ఒక పరిశ్రమ వచ్చింది లేదు.. ఒక ఇటుకా పేర్చింది లేదని పేర్కొన్నారు. కానీ భూసేకరణ పేరుతో రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఎంత అణచివేసినా ప్రజలు, రైతుల తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని హెచ్చరించారు.