CM KCR | హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం మొదలైంది. ఇప్పటిదాకా నిర్వహించింది రెండు సభలే అయినా టాక్ ఆఫ్ ది స్టేట్గా మారింది. ప్రధాన రాజకీయ పక్షాలన్నింటిలో బీఆర్ఎస్ ప్రకంపనలు సృష్టిస్తున్నది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ముందుకు రావటాన్ని స్వాగతిస్తున్నామంటూ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్కు వచ్చిన ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్గాంధీపై అనర్హత వేటు వేయటాన్ని కేసీఆర్ ఖండించారని, దీన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ రాజకీయ వ్యూహామేంటో తమకు అర్థం కావటం లేదని చెప్పారు. ఇప్పటికే మహారాష్ట్రలో కేసీఆర్ రెండుసార్లు పర్యటించిన సంగతిని గుర్తు చేసుకున్నారు. ఇటీవలే కంధార్ లోహాలో నిర్వహించిన బీఆర్ఎస్ సభ సందర్భంగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ కూడా కేసీఆర్ గురించి వ్యాఖ్యానం చేశారు.