హైదరాబాద్, జూలై 12(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్-శోభమ్మ దంపతులు మనవడు హిమాన్షుకు పుట్టినరోజు దీవెనలు అందించారు. కేటీఆర్-శైలిమ దంపతుల కుమారుడు హిమాన్షు 21వ జన్మదిన వేడుకలు ఆదివారం ఉదయం నార్సింగిలోని కేటీఆర్ నివాసంలో కుటుంబసభ్యులందరి సమక్షంలో నిరాడంబరంగా జరిగాయి.

ఈ సందర్భంగా హిమాన్షుకు కేసీఆర్-శోభమ్మ దంపతులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపగా, వారికి హిమాన్షు పాదాభివందనం చేశారు. ఆయురారోగ్యాలతో చల్లగా వర్థిల్లాలని, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ కేసీఆర్-శోభమ్మ దంపతులు దీవించారు.