హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మంగళవారం కుటుంబ సమేతంగా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు రమణ కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.