సింగపూర్ : తెలుగు వారంతా ఐక్యమత్యంగా ఉంటే తెలుగుని సింగపూర్ ప్రభుత్వం కూడా గుర్తిస్తది. తెలుగు సమాజం ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటున్న విధంగా తెలుగు భాషను సింగపూర్ ప్రభుత్వ పాఠశాలలో బోధించడం సులభతరం అవుతుందని సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఆ ప్రక్రియలో తమ సహాయ సహకారాలు కూడా ఎప్పుడూ ఉంటాయని హామీనిచ్చారు.
సింగపూర్లో భారత పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ‘సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్’ ప్యానల్ సభ్యునిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా.. సింగపూర్లోని ప్రధాన తెలుగు సంస్థలైన శ్రీ సాంస్కృతిక కళాసారథి, తెలుగుదేశం ఫోరమ్ మొదలైన సంస్థల ప్రతినిధులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్, సభ్యులు టేకూరి నగేష్, అమ్మయ్య చౌదరి, సతీష్ పారేపల్లి, తదితరులు పాల్గొన్నారు.