కోనరావుపేట, మార్చి 4: అటవీ ప్రాంతం నుంచి నీళ్ల కోసం వచ్చి ప్రమాదావశాత్తు బావిలో పడిన చుక్కల దుప్పిని ఫారెస్ట్ అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్రిమడ్లలో సోమవారం చోటుచేసుకున్నది. దాహం తీర్చుకునేందుకు అటవీ ప్రాంతం నుంచి ఓ చుక్కల దుప్పి ఆకుల రాజేశం అనే రైతు వ్యవసాయ బావి దగ్గరికి వచ్చింది.
నీళ్లు వెతికే క్రమంలో కాలుజారి బావిలో పడింది. అటుగా వెళ్లిన ఓ వ్యక్తి గమనించి గ్రామస్థులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎఫ్ఎస్వో ఆయూబ్ఖాన్ గ్రామస్థులతో కలిసి తాళ్ల సహాయంతో దుప్పిని సురక్షితంగా బయటకు తీశారు. తర్వాత అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఎఫ్ఎస్వో వెంట బీట్ ఆఫీసర్ శ్రీశైలం, తదితరులు ఉన్నారు.