హరితహారంతో నెరవేరుతున్న ప్రభుత్వం లక్ష్యం
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 15 : తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో హైదరాబాద్ మహానగరం పరిధిలో అటవీ విస్తీర్ణం 147 శాతం పెరిగింది. గతంలో 33.15 చదరపు కిలోమీటర్లు ఉన్న అటవీ విస్తీర్ణం.. హరితహారం కార్యక్రమం చేపట్టిన తర్వాత 81.81 చదరపు కిలో మీటర్లకు పెరిగినట్టు ఎఫ్ఎస్ఐ (ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా) ప్రకటించిందని జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం తెలిపారు. ఎఫ్ఎస్ఐతోపాటు అర్బోర్ డే ఫౌండేషన్ సంస్థ, ఎఫ్ఏవో (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యూఎన్) సంస్థలు 2020 సంవత్సరానికిగాను హైదరాబాద్ నగరాన్ని ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్గా గుర్తించినట్టు వివరించారు. 63 దేశాలకు చెందిన 119 పట్టణాలు, నగరాలు ఈ పోటీల్లో పాల్గొనగా.. హైదరాబాద్ నగరం ఈ ఘనత సాధించినట్టు పేర్కొన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరంలో ప్రజల జీవనప్రమాణాలను పెంపొందించాలన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నది.