హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Shamshabad airport) విదేశీ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ప్రయాణికులను సీఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ బృందం తనిఖీ చేసింది. ఈ సందర్భంగా సయ్యద్ ఖలీద్ అనే వ్యక్తి వద్ద రూ.13 లక్షలు విలువచేసే సౌదీ కరెన్సీ (65 వేల సౌదీ రియాల్) లభించింది. దీంతో అధికారులు విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడుని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.