హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ)/కొత్తగూడెం అర్బన్: రికార్డు స్థాయి ధరలు నమోదు చేస్తున్న టమాటా దాన్ని పండించిన రైతులకే కాదు ఇతర వ్యాపారులకూ వినూత్న ఆలోచనలకు పురిగొల్పుతూ కాసులు కురిపిస్తున్నది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పట్టణానికి చెందిన వేముల స్థానిక కలెక్టరేట్ సమీపంలో కొంతకాలంగా ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నాడు. ఇటీవల కలెక్టరేట్ పాల్వంచకు మారడంతో ఆనంద్ గిరాకీ బాగా తగ్గిపోయింది. దీంతో ఆనంద్ ఓ కొత్త ఆలోచన చేశాడు.
అనుకున్నదే తడవుగా పట్టణంలోని ప్రధాన కూడళ్లు, జనసమ్మర్థ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. తన వద్ద ఫొటో తీయించుకున్నవారు రూ.100 చెల్లిస్తే పాస్పోర్టు సైజు ఫొటో కాపీలు 8 ఇస్తూనే ఉచితంగా పావు కిలో టమాటాలు అందిస్తానని ప్రచారం చేశాడు. బుధవారం ఫొటోలు తీయించుకున్న 32 మందికి ఒక్కొక్కరికీ రూ.40 విలువ గల పావు కిలో టమాటాలు అందించినట్టు ఆనంద్ తెలిపారు. మరోవైపు టమాటా ఆంధ్రప్రదేశ్లో ఆల్టైం రికార్డులు నమోదు చేస్తున్నది. అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని అంగళ్లు మార్కెట్లో కిలో రూ.224 పలికింది.
Hyderabad | గే యాప్ ద్వారా వల.. అమాయకపు యువకులతో ఆడుకుంటున్న రౌడీ షీటర్