జనగామ జిల్లా పాలకుర్తిలో పద్మశాలి కమ్యూనిటీ హాల్ నిర్మాణ కోసం చేపట్టిన తవ్వకాల్లో గురువారం పురాతన కాలం నాటి పాదముద్రలతో కూడిన బండ రాయి బయటపడింది. పిల్లర్ గుంతలు తవ్వుతుండగా కనిపించిన దీనిపై రెండు పాదాలతో కూడిన రూపం ఉందని కూలీలు తెలిపారు.
పురావస్తు శాఖ అధికారులు దీనిని పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.
– పాలకుర్తి