సూర్యాపేట : వరుస కరువులతో అల్లాడిన తెలంగాణ నేల ఇపుడు వ్యవసాయానికి పూర్తిగా అనుకూలంగా మారిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి సమయాన్ని రైతాంగం తమకు అనుకూలంగా మలుచుకుంటే ఆర్థికంగా పరిపుష్టి కాగలుతారని ఆయన చెప్పారు. అందుకు చేయాల్సిందల్లా మూస పద్ధతుల్లో చేసే వ్యవసాయానికి స్వస్తి పలికి వాణిజ్య పంటల వైపు రైతులు దృష్టి సారించాలన్నారు.
పెన్పహాడ్ మండలం చీదేళ్ల, ధూపాడ్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రైతు వేదికలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు అవగాహన కల్పించేందుకే సీఎం కేసీఆర్ రైతు వేదికల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారన్నారు. ధూపాడ్ గ్రామంలో ఉన్న భూములో 80 శాతానికి పై బడి వ్యవవసాయనికి అనుకూలంగా ఉందన్నారు. ఇక్కడ రైతులు చేపల పెంపకం, వేరుశనగ, ఫామయిల్ వంటి వాణిజ్య పంటల వైపు దృష్టి సారిస్తే అధిక ఆదాయం గడించ వచ్చన్నారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రజాక్, స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల లలిత, ఎంపీపీ నెమ్మాది భిక్షం తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మినీ ఇండియాగా శ్రీరామ కాలనీ : మంత్రి సబిత
కాగజ్నగర్లో భారీ గుట్కా డంప్ స్వాధీనం
పెద్దపల్లిలో సఖీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కొప్పుల
హుజురాబాద్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం
మానవత్వం చాటిన పోలీస్ అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం