రంగారెడ్డి : సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తున్నదని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మంత్రి జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 17,18, 19 వార్డులలో రూ. కోటి 39 లక్షల నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. మిషన్భ గీరథ ట్యాంక్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. ఇక్కడి శ్రీరామకాలనీలో ప్రత్యేక పరిస్థితి ఉంటుందన్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాలకు సంబంధించిన ప్రజలు శ్రీరామకాలనీలో ఉంటున్నారన్నారు.
మినీ ఇండియా అని హైదరాబాద్ను అంటాం. అలాగే శ్రీరామకాలనీ కూడా మినీ ఇండియాగా మారిందన్నారు. ఇతర రాష్ర్టాల వారు మన మీద నమ్మకం, విశ్వాసంతో ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పర్చుకుంటున్నారని తెలిపారు. అందరికి మౌలిక వసతుల కల్పించే బాధ్యత మనపై ఉందన్నారు. జనాభాకు అనుగుణంగా రూ. 64 లక్షలతో ట్యాంకును నిర్మించామని పేర్కొన్నారు.
100 గజాల లోపు ఉన్న వారికి రూ.1కే కనెక్షన్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఎలాంటి అవినీతి జరగకుండా కౌన్సిలర్లు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అవినీతికి ఆస్కారం లేని పాలన సాగిస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కాగజ్నగర్లో భారీ గుట్కా డంప్ స్వాధీనం
పెద్దపల్లిలో సఖీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కొప్పుల
హుజురాబాద్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం
మానవత్వం చాటిన పోలీస్ అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం