భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా తగ్గింది. గోదావరి నీటిమట్టం 51.3 అడుగులకు చేరింది. నిన్న సాయంత్రం 5 గంటల సమయానికి వరద ప్రవాహం 52.20 అడుగుల వద్ద కొనసాగిన విషయం తెలిసిందే. గోదావరికి వరద పోటెత్తిన నేపథ్యంలో భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాహనాలను నిలిపివేయడంతో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాజేడు, వెంకటాపురం, అశ్వాపురం, చర్ల, బూర్గంపాడు, దుమ్ముగూడెం మండలాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వరద కొనసాగుతోన్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను కూడా తగ్గించింది.