శ్రీశైలం : శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాజెక్టుల నుండి వరద నీరు నిలకడగా వస్తుంది. ప్రస్తుతం రిజర్వాయర్లో నీటిమట్టం 882 అడుగలకు చేరింది. శుక్రవారం ఉదయం జూరాల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 40,446 క్యూసెక్కులు, సుంకేసుల నుండి 71,172 క్యూసెక్కుల నీరు (మొత్తం 1,11,618 క్యూసెక్కుల నీరు ) విడుదల అయింది. శుక్రవారం సాయంత్రానికి లక్ష అరవై వేల క్యూసెక్కులకు పైగా జలాశయానికి నీరు వచ్చి చేరింది.
జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 882 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలుకాగా ప్రస్తుతం 198.362 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ఏపీ పవర్ హౌస్లో విద్యుత్ ఉత్పత్తి చేసి 31,109 క్యూసెక్కుల నీటిని వినియోగించగా టీఎస్ పవర్హౌస్లో విద్యుత్ ఉత్పత్తి చేసి 31,784క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.