Medigadda | మహదేవపూర్, జూలై 2 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్కు వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా మహారాష్ట్రలోని ప్రాణహిత నది, తెలంగాణలోని గోదావరి నదుల ప్రవాహం పెరిగింది. రెండు నదుల ద్వారా మంగళవారం బరాజ్ ఇన్ఫ్లో 12,500 క్యూసెక్కులు రాగా, బుధవారం బరాజ్ ఇన్ ఫ్లో 19,200 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో బరాజ్లోని మొత్తం 85 గేట్లను ఎత్తి అంతే మొత్తంలో వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. బరాజ్లో ప్రస్తుత వరద ప్రవాహం సముద్ర మట్టానికి 89.40 మీటర్ల ఎత్తులో ఉన్నదని అధికారులు వెల్లడించారు. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.