హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): పూర్వ వీఆర్ఏలకు ఎంప్లాయీ ఐడీలు ఇచ్చి, వేతనాల సమస్యను పరిష్కరించినందుకు ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డికి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ కృతజ్ఞతలు తెలిపింది. గురువారం హైదరాబాద్లో ఆ జేఏసీ అధ్యక్షుడు లచ్చిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పూర్వ వీఆర్ఏల మిగతా సమస్యలను కూడా దశలవారీగా ప్రభుత్వం పరిషరించాలని కోరారు.
61 మంది రికార్డు అసిస్టెంట్లకు ఇంకా ఏ శాఖలోనూ పోస్టింగ్ ఇవ్వలేదని, క్రమబద్ధీకరణలో భాగంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వీఆర్ఏలను సొంత జిల్లాలకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. 61 ఏండ్లు దాటిన వీఆర్ఏ వారసులకు, 2014 తర్వాత చనిపోయిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. రెవెన్యూ విధుల నిర్వహణకు గ్రామ స్థాయిలో పటిష్ఠమైన యంత్రాంగాన్ని మళ్లీ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, తెలంగాణ తాసిల్దార్ల సంఘం అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి రమేశ్, పూల్సింగ్, వీఆర్ఏల నాయకుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.