హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): 50 ఏండ్ల వయసున్న గీత, చేనేత కార్మికుల్లాగే మత్స్యకారులకు కూడా పెన్షన్ ఇవ్వాలని మత్స్య ఫెడరేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సోమవారం ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో తీర్మానించారు. మధ్యా హ్న భోజనంలో చేపల వంటకాలు చేర్చడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని, కలెక్టరేట్లలో ఫిష్ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని తీర్మానించారు.
మత్య్సకారులకు రక్షణ కల్పించేలా చట్టం రూపకల్పన చేయడం, సోలార్ పడవలు అందించడం, మహిళా మత్స్యకారులను ప్రోత్సహించేలా వ్యాపార అవకాశాలు కల్పించ డం వంటి 23 అంశాలపై తీర్మానం చేశా రు. సమావేశంలో వైస్ చైర్మన్ దీటి మల్ల య్య, ఎన్సీడీసీ రీజనల్ డైరెక్టర్కృష్ణవంశీ, మేనేజింగ్ డైరెక్టర్ లచ్చిరాం,జనరల్ మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.