మహబూబ్నగర్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ సాగునీటి రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానున్నది. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐసీ) కీలక దశకు చేరుకొన్నది. నార్లాపూర్ పంపుహౌజ్లోని మొదటిపంపు డ్రైరన్కు సిద్ధమైంది. చీఫ్ ఇంజినీర్ హమీద్ఖాన్ నేతృత్వంలో ఎత్తిపోతల పథకాల ప్రభు త్వ సలహాదారు పెంటారెడ్డి అధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. పీఆర్ఎల్ఐసీ పథకంలో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి మొత్తంగా ఆరు దశల్లో నీటిని ఎత్తి పోయాల్సి ఉంది. అందుకు సంబంధించి ప్రభుత్వం పనులను మొత్తంగా 21 ప్యాకేజీలు గా విభజించగా.. అందులో నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు 18 ప్యాకేజీల పనులను చేపట్టింది. అందులో 4 పంప్హౌజ్లను నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే నార్లాపూర్, ఏదుల, వట్టెంల పంప్హౌజ్లు తుదిదశకు చేరుకొన్నాయి. ఉద్దండాపూర్ పంప్హౌజ్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నార్లాపూర్ పంప్హౌజ్లో 145 మెగావాట్ల సామర్థ్యమున్న 9 పంపులను ఏర్పాటు చేయాల్సి ఉంది.
ఏదుల, వట్టెంల పంప్హౌజ్లలో 9+1 చొప్పున పంపులను, ఉద్దండాపూర్లో 4+1 పంపులను అమర్చాల్సి ఉంది. ఇప్పటికే నార్లాపూర్ పంప్హౌజ్లో 2, ఏదులలో 3, వట్టెంలో 3 పంపుల అమరిక పూర్తిగా సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో నార్లాపుర్ పంప్హౌజ్లో అమర్చిన మొదటి పంప్ డ్రైరన్ను నేడు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నార్లాపూర్ పంప్హౌజ్ వద్ద ఏర్పాటు చేసిన 400కేవీ సబ్స్టేషన్ టెస్టింగ్ పనులను నిర్వహించగా, అది విజయవంతమైంది. మొదటి పంపునకు సంబంధించిన కంట్రోల్ ప్యానల్, ఇతర ఎలక్ట్రో మెకానికల్ విభాగాల పనితీరును పరీక్షించగా, అవి కూడా సక్సెస్ అయ్యా యి. ప్రస్తుతం పూర్తిస్థాయిలో మొదటిపంపు డ్రైరన్ను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అందుకు సంబంధించిన పనులను చీఫ్ ఇంజినీర్ హమీద్ఖాన్, ప్రభుత్వ ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి అకడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. నేటి ఉదయం ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీ మురళీధర్ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం పంప్ డ్రైరన్ను ప్రారంభించనున్నారు. ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసి, వెట్న్క్రు సిద్ధమవుతామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నీటిని విడుదల చేస్తామని చెప్తున్నారు. పాలమూరు ప్రాజెక్టు మొదటి పంప్ డ్రైరన్కు సిద్ధంకావడంతో ఇక్కడి రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. త్వరలోనే తమ బీడు భూముల్లో కృష్ణమ్మ పరుగులు తీస్తుందని, ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని ఆనందపడుతున్నారు.