హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్1లో మొదటిరోజు తొలి షిఫ్ట్ పరీక్ష రాసిన వారిలో ఏకంగా ఎనిమిది మంది అభ్యర్థులు వంద పర్సంటైల్ మార్కులను సొంతం చేసుకొన్నారు. మొదటిరోజు పేపర్ సులభంగా రావడం.. మిగతా షిఫ్ట్ల్లో పేపర్ కఠినంగా రావడమే కారణం. ఆ తర్వాత జరిగిన తొమ్మిది షిఫ్ట్ల్లో ఇలా జరగలేదు. ఒకరిద్దరు మాత్రమే వంద పర్సంటైల్ సాధించారు.
కొందరికి మోదం..మరికొందరికి ఖేదం
జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన జేఈఈ మెయిన్ -1 పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రికార్డుస్థాయిలో 12.21 లక్షల అభ్యర్థులు హాజరయ్యారు. 2023లో 8.60లక్షల మంది హాజ రు కాగా, ఈ ఏడాది 27 శాతం అధికంగా దరఖాస్తులొచ్చాయి. కఠినంగా ప్రశ్నపత్రాల వారికి ఎన్టీఏ కొన్ని మార్కులను కలుపుతుం ది. కానీ, ఇది కొన్నేండ్లుగా ఫలితమివ్వలేదు. దీంతో కొందరికి మోదం.. మరికొందరికి ఖే దం అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఈ సారి కొన్ని సెషన్లలో ప్రశ్నలు, సమాధానాలను తప్పుగా ఇచ్చారు. ఆయా ప్రశ్నలను తొలగించడం, అందరికీ మార్కులు కలపడంతో ఫలితాలపై ప్రభావం చూపింది.
విశ్లేషణ ఇలా..