జగిత్యాల: కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంట్లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. సంక్రాంతి సందర్భంగా మెట్పల్లిలోని ఎమ్మెల్యే ఇంట్లో పిండి వంటలు చేస్తున్నారు. ఈ క్రమంలో గ్యాస్ లీకవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే భార్య సరోజ స్వల్పంగా గాయపడ్డారు. దీంతో ఆమెను హైదరాబాద్లోని ఓ దవాఖానకు తరలించారు.