సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని రెండు పరిశ్రమల్లో అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి సీఎంఎస్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ఈ పేలుడు ధాటికి పక్కనే ఉన్న వనమాలి పరిశ్రమలోకి కూడా మంటలు వ్యాపించాయి. దీంతో రెండు పరిశ్రమల్లోనూ భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.
ఈ అగ్ని ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో పరిశ్రమల్లో 11 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. కాగా, భారీగా మంటలు ఎగిసిపడటంతో ఐదు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు.