Loksabha Elections 2024 : హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి మాధవీలతపై కేసు నమోదైంది. ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ ఆదేశాలతో మలక్పేట్ పీఎస్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఓటర్ల స్లిప్లను పరిశీలించారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 171సీ, 186, 505(10)(సీ), ప్రజాప్రాతినిధ్య చట్టం 132 సెక్షన్ కింద కేసు నమోదైంది.
మాధవీలత ఓటర్ ఐడీలు, స్లిప్లను పరిశీలిస్తూ ఓటర్లను తనిఖీ చేస్తున్న వీడియో వెలుగుచూసింది. ఓటర్ల ముఖాలను చూసి, వారిని గుర్తించిన తర్వాత ఓటింగ్కు అనుమతించాలని ఆమె అధికారులతో వాగ్వాదానికి దిగారు.
ఓటర్ స్లిప్ల తనిఖీ ఎన్నికల నియమావళి ఉల్లంఘనే అని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ (CEO Vikas Raj) అన్నారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణలో 40 శాతం పైగా పోలింగ్ నమోదైందని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో 50 శాతం పోలింగ్ నమోదైందని తెలంగాణ వికాస్ రాజ్ పేర్కొన్నారు.
In the dance of democracy, look at how veiled Muslim women voters are treated!!
Just look at Madhavi Latha, she’s shaming muslim women for their appearances. And according to UIDAI aadhar photo need to updated every 10 years. The photo might be old..what’s wrong in that.
Arvind… pic.twitter.com/Cvkt3gG3eV— Dr. Extra2ab Ø (@SaffronSalim) May 13, 2024
Read More :
Muslim Voters | ముస్లిం మహిళా ఓటర్లపై ధర్మపురి అరవింద్, మాధవీలత అభ్యంతరం.. వీడియో